APలో వర్షాలు.. గాలులు.. హెచ్చరిక..!

APలో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మబ్బుల వాతావరణంతో పాటు పిడుగులు పడొచ్చట. కొన్ని చోట్ల 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ పంటలు, ఆస్తులు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు భద్రతపై దృష్టి పెట్టాలని అధికారులు చెబుతున్నారు.



