తల్లికి వందనం నిధులు కాజేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్

AP ప్రభుత్వం ఇటీవల 'తల్లికి వందనం' పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నిధులను లక్ష్యంగా చేసుకుని కర్నూలులో సైబర్ మోసం వెలుగుచూసింది. ఎయిర్టెల్ సిమ్ సేల్స్పర్సన్గా పనిచేస్తున్న ఉపేంద్ర, సిమ్ విక్రయాల సమయంలో బాధితుల ఆధార్, వేలిముద్రలు, బ్యాంకు వివరాలను సేకరించి వాటిని దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 28మంది ఖాతాల నుంచి డబ్బులు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదుతో నిందితులు ఉపేంద్ర, వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



