← Back to news

తల్లికి వందనం నిధులు కాజేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్

By DK· 29 Jul 2026· కర్నూలు జిల్లా
తల్లికి వందనం నిధులు కాజేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్

AP ప్రభుత్వం ఇటీవల 'తల్లికి వందనం' పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నిధులను లక్ష్యంగా చేసుకుని కర్నూలులో సైబర్ మోసం వెలుగుచూసింది. ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్‌పర్సన్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర, సిమ్ విక్రయాల సమయంలో బాధితుల ఆధార్, వేలిముద్రలు, బ్యాంకు వివరాలను సేకరించి వాటిని దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 28మంది ఖాతాల నుంచి డబ్బులు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదుతో నిందితులు ఉపేంద్ర, వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 12h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.