అప్పుడు గర్వంగా భావించారు, 7 నెలలు గడవకముందే

TG: రోడ్లు, భవనాల శాఖ ENC జే.మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACBకి చిక్కి జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. అయితే గతేడాది నవంబర్లో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) కౌన్సిల్ సమావేశంలో మోహన్ నాయక్ను దేశంలోనే ప్రతిష్టాత్మకమైన IRC అధ్యక్ష పదవికి ఎంపిక చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా భావించారు. కానీ, సరిగ్గా 7 నెలలు గడవకముందే ఆయన అవినీతి బాగోతం బయట పడడంతో తెలంగాణ ప్రతిష్టను బజారున పడేశాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



