రూరల్ ఎకానమీకి ఊతం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇథనాల్కు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఆ రంగంలో రైతులను ప్రోత్సహించాలని అధికారులకు CM సూచించారు. రూరల్ ఎకానమీని బలోపేతం చేసేలా ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటు దిశగా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఇంధనానికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ రూపొందించాలని సూచించారు.



