TDP కార్యకర్తపై కర్రలు, రాళ్లతో దాడి

AP: కర్నూల్ జిల్లాలో TDP కార్యకర్త తైజుమ్ బాషా అనే యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కర్రలు, రాళ్లతో విచక్షణా రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన తైజుమ్ స్పాట్లోనే స్పృహ కోల్పోయాడు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే కర్నూల్ గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. తన ఇంటి నుంచి కిరాణాషాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు కాపుకాసి హత్యాయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దాడిచేసిన వారిలో జలీల్, ఫైజల్, ఆరిఫ్ మరికొందరు ఉన్నట్లు, వీరంతా YCP కార్యకర్తలుగా చెబుతున్నారు.




