ప్రయాణికుల్లా వచ్చారు… డ్రైవర్ను ఎందుకు చంపేశారు?

ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల క్యాబ్ డ్రైవర్కు జైపూర్ ట్రిప్ అంటూ ఆఫ్లైన్ బుకింగ్ వచ్చింది. జూలై 20న సరితా విహార్ నుంచి ప్రయాణికులను ఎక్కించుకున్న అతడిని మధ్యలోనే దాడి చేసి చంపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాత మృతదేహాన్ని రాజస్థాన్లోని అడవుల్లో పడేసి, కారును కూడా తీసుకెళ్లారు. కేసు దర్యాప్తులో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో 16 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. డబ్బుల కొరతతో కారును దోచుకోవాలనే ప్లాన్లోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.



