← Back to news

వక్ఫ్‌ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

By MPJ· 27 Aug 2026
వక్ఫ్‌ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

AP: వక్ఫ్‌ భూముల వివరాలు, హద్దులను నిర్ధారించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో వక్ఫ్‌ బోర్డుకు సంబంధించిన భూములను పల్నాడు జిల్లా వక్ఫ్‌ బోర్డు ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ నూహ్‌, వీఆర్వో సైదా ఆధ్వర్యంలోని సర్వే బృందం పరిశీలించింది. భూముల విస్తీర్ణం, హద్దులు, ప్రస్తుత పరిస్థితిపై క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు. సంబంధిత రెవెన్యూ రికార్డులను పరిశీలించడంతో పాటు భూముల సరిహద్దులను గుర్తించి అవసరమైన సమాచారాన్ని నమోదు చేశారు.

వక్ఫ్‌ భూములపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

More in Local