NEET PG–2026 ప్రవేశ పరీక్షకు ఫుల్ రెడీ : కలెక్టర్

దేశవ్యాప్తంగా రేపు జరగనున్న నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షకు జగిత్యాల లోనూ అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 am నుంచి 12:30 pm వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు 7am నుంచి 8:30 am మధ్య పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్, వైద్య, రవాణా, ఇంటర్నెట్ సదుపాయాలతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.

