70 ఏళ్ల వయసులో రైతుకు కొత్త జీవితం

TG : కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ సక్సెస్ అయింది. సిరిసేడు గ్రామానికి చెందిన 70 ఏళ్ల రైతుకు 16 ఏళ్ల క్రితం కాలేయానికి ఆపరేషన్ జరిగింది. అయితే మళ్లీ కాలేయంతో పాటు కడుపు భాగంలోకి వ్యాధి వ్యాపించింది. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో దాదాపు 8 ఆసుపత్రులు ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోలేదు. చివరకు జమ్మికుంట హాస్పిటల్లో డాక్టర్ ను సంప్రదించారు. ఆయన పరీక్షించి కాలేయంలో 12 తిత్తులు ఉన్నట్లు గుర్తించారు. తన అనుభవంతో ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేసి రైతు ప్రాణాలను కాపాడారు.




