పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి

TG: హన్మకొండకు చెందిన పవన్ కల్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్(17) మృతి చెందాడు. ఇటీవల అతడి ఆరోగ్యం క్షీణించడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ హాస్పిటల్కు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి నిరంజన్ మృతి చెందాడు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమైన నిరంజన్ను గతనెలలో పవన్ పరామర్శించారు. నిరంజన్ను కలిసినప్పుడు పవన్ కల్యాణ్ ఆత్మీయంగా హత్తుకుని ధైర్యం చెప్పారు. ‘OG 2' మూవీ తీస్తే అందులో నువ్వే నా స్పెషల్ గెస్ట్' అని, ఇద్దరం కలిసి సినిమా చూద్దామని పవన్ చెప్పారు.



