శిలాఫలకం వేసి మూడేళ్లైనా.. రోడ్డు పనులు ఏవి?

TG : మోత్కూర్ మండలం సదర్శాపురం కొమ్మూరిబావి దగ్గర రోడ్డు చాలా రోజులుగా దారుణంగా ఉంది. వర్షం పడితే, ఊరంతా బురదగా అవుతుందని ప్రజలు అంటున్నారు. రోడ్డు వేస్తామని శిలాఫలకం వేసి, నిధులు మంజూరై మూడేళ్లు అవుతున్నా, ఇప్పటివరకు పనులు మొదలుకావట్లేదని తెలిపారు. నడిచేవాళ్లు, బైక్లపై వెళ్లేవాళ్లు ఈ రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. అధికారులు, నాయకులు స్పందించి వెంటనే ఈ రోడ్డు పని పూర్తి చేసి కష్టాలు తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.




