బహుజన రాజ్యాధికారంతోనే సామాజిక మార్పు

AP: జనాభాలో బహుజనులు అధికంగా ఉన్నా.. రాజకీయ అధికారం మాత్రం కొద్దిమంది ఆధిపత్య కులాల చేతుల్లోనే ఉందని, ఈ పరిస్థితి మారాలంటే బహుజన రాజ్యాధికారం సాధించాల్సిందేనని ఏఐబీఎస్పీ నేతలు అన్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో చంద్రప్ప అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం, జిల్లా గౌరవ అధ్యక్షులు తరిగొండ మణి మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో లేదన్నారు.



