← Back to news

ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు.. APకి కరువు ముప్పు

By డీకే· 7 Jul 2026
ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు..  APకి కరువు ముప్పు

AP: నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా.. వర్షాలు లేకపోవడంతో ఆందోళన మొదలైంది. గ్లోబల్‌ వార్మింగ్‌, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు పడిపోవడమే కాక.. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.810 TMCలు కాగా.. ప్రస్తుతం 42.213 TMCలే ఉన్నాయి. నిరుడు వరదలు పోటెత్తడంతో ఇదే సమయానికి దాదాపు 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. 3.95 లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించే తుంగభద్ర డ్యాం నీటి ప్రవాహం లేక వెలవెల బోతుంది.

More in AP