← Back to news

నేరెళ్ల బాధితుడు కన్నుమూత

By DK· 11 Jul 2026· రాజన్నసిరిసిల్ల జిల్లా
నేరెళ్ల బాధితుడు కన్నుమూత

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో 2017 జూలైలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇసుక లారీలు అడ్డుకున్న దళితులను పోలీసులు తీవ్రంగా హింసించి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, ఆ తర్వాత పరిణామాలు పెద్ద వివాదంగా మారాయి. ఈ ఘటనలో పోలీసుల థర్డ్ డిగ్రీకి గురైన ఎనిమిది మంది బాధితుల్లో ఒకరైన గంధం గోపాల్ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందారు. గోపాల్ మృతితో మిగిలిన బాధితులు మరోసారి న్యాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఘటన జరిగి దాదాపు పదేళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదని, ప్రభుత్వాలు మారినా తమ పరిస్థితి మాత్రం మారలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

More in TG