29, 30వ తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచారం

పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల కోసం ఈ నెల 29, 30 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి లోకేష్ వర్మ తెలిపారు. ఈ రెండు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

