చిట్టీలు వేసి.. కోట్లతో ఉడాయించిన దంపతులు

TG: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చిట్టీల పేరుతో సుమారు రూ.2 కోట్లు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన కలకలం రేపింది. BSR కాలనీలో నివసిస్తున్న శిరీష, సాంబశివరావు, స్థానికుల నుంచి చిట్టీల పేరుతో భారీగా డబ్బు సేకరించారు. గడువు ముగిసినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో బాధితులు వారిని సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన దంపతుల కోసం గాలింపు చర్యలు చేపట్టి, ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



