← Back to news

రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది: సింగిరెడ్డి

By DK· 30 Jul 2026· వనపర్తి జిల్లా
రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టింది: సింగిరెడ్డి

TG: రాష్ట్రంలో కరువు ఎల్‌నినో వల్ల కాదు, కాంగ్రెస్ పాలన వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను ప్రభుత్వం నిలిపివేసిందని, రైతుల ప్రయోజనాలను విస్మరించిందని అన్నారు. వరద నీటిని సక్రమంగా వినియోగించకుండా ఇతర రాష్ట్రాలకు వదిలేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తిచేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

More in Politics