పద్మశాలి సంఘంలో ఘనంగా వేడుకలు

షాద్నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వర్కల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘభవనంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శివ మారుతి, రవి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మార్కండేయస్వామి పూజ, గాయత్రీ మంత్రోచ్చారణల మధ్య గాయత్రీధారణ నిర్వహించారు. అనంతరం 108 మంది దంపతులతో ప్రత్యేక హోమాలను నిర్వహించారు.



