← Back to news

హెల్త్ సెంటర్‌లో రోగులు వెయిటింగ్.. సిబ్బంది స్లీపింగ్

By dk· 7 Aug 2026· మహబూబాబాద్ జిల్లా
హెల్త్ సెంటర్‌లో రోగులు వెయిటింగ్.. సిబ్బంది స్లీపింగ్

TG: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ప్రభుత్వ CHCలో సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరు ఉద్యోగులు విధులు నిర్వహించకుండా మొబైల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తుండగా, మరికొందరు కార్యాలయంలోనే నిద్రపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వైద్యసేవల కోసం ఆసుపత్రికి వచ్చిన రోగులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశాకార్యకర్తలు కూడా గ్రామాల్లో సమయపాలన పాటించడం లేదని వాపోతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 7h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.