← Back to news

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి: ఎమ్మార్పీఎస్

By Repalle Rajesh· 28 Aug 2026

TG: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల్‌లో వికలాంగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జి బుర్రి సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని సూచించారు.

More in Local