భూవివాదాలు లేని తెలంగాణే లక్ష్యం: పొంగులేటి

TG: భూసమస్యలు, భూవివాదాలు లేని తెలంగాణను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సాగు భూములను రీసర్వే చేయించాలనే కీలక నిర్ణయం తీసుకుందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫెరెన్స్లో మంత్రి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే కార్యక్రమాన్ని వచ్చే నెల నుంచి దశలవారీగా నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నంబరుకు భూధార్, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.



