స్టీరింగ్ మీదే గుండెపోటు- 100 ప్రాణాలు కాపాడిన హీరో లక్ష్మణ్

జగిత్యాల జిల్లా మద్దూనూరు నుంచి వస్తున్న RTC బస్సు డ్రైవర్ లక్ష్మణ్కు ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. తీవ్ర నొప్పితోనే.. ఆయన బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు నిలిపి స్టీరింగ్పైనే పడిపోయారు. దీంతో ఆ టైంలో అందులో ప్రయాణిస్తున్న 100 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.సమయానికి 108 రాకపోవడంతో ఆటోలో ఆయనను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే Mondayతో రిటైర్ అవ్వాల్సిన లక్ష్మణ్ అనారోగ్యంలో ఉన్నా డిపో అధికారులు బలవంతంగా డ్యూటీ వేశారు.

