← Back to news

నీళ్లు విడుదలైనా పొలాలకు చేరడం లేదు.. రైతుల ఆవేదన

By Repalle Rajesh· 28 Aug 2026

TG: జోగులాంబగద్వాల జిల్లాలో RDS (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కెనాల్‌ దుస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. కెనాల్‌కు సాగునీరు విడుదల చేసినా కాలువలో నీరు సక్రమంగా ప్రవహించి పొలాలకు చేరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెనాల్‌ కంపచెట్లు, ముళ్లపొదలతో నిండిపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని తెలిపారు. పలుచోట్ల లైనింగ్‌ దెబ్బతిని పెచ్చులూడిపోవడంతో నీరు లీకై వృథాగా పోయే ప్రమాదం ఉందన్నారు. సాగు సమయంలో నీరు సక్రమంగా అందకపోతే పంటలకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.

More in Local