రూ.10 వేల కోట్ల విండ్.. 4 వేల జాబ్స్!

ఏపీలో విండ్ ఎనర్జీది కొత్త చాప్టర్! అనంతపురం రాయదుర్గంలో సుజ్లాన్ రూ.10,000 కోట్ల పెట్టుబడితో 1,325 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. దీంతో ప్రత్యక్ష, పరోక్షంగా 4,000 మందికి ఉపాధి లభించనుంది – ఇది ఏపీ ఎకనమీకి ఊతం! మరోవైపు, కణేకల్లు హులికెరలో S-144 అత్యాధునిక బ్లేడ్ ఉత్పత్తి లైన్ను మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభిస్తారు. ప్రస్తుతం 1,700 MW సామర్థ్యం ఉన్న సుజ్లాన్, 2030 నాటికి 5K MW లక్ష్యం పెట్టుకుంది. ప్రభుత్వంతో భారీ రాయితీలు పొందిన సుజ్లాన్ తక్కువ ధరకే కరెంటు ఇస్తుందని ఆశిద్దాం.



