← Back to news

ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రుల హామీ

By DK· 12 Jul 2026
ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రుల హామీ

AP: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. సచివాలయంలో AP ఐకాస అమరావతి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉద్యోగుల అంశాలపై మంత్రులు మాట్లాడారు. ఉద్యోగసంఘాల ప్రతినిధులు మొత్తం 23 డిమాండ్లతో వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై CM చంద్రబాబు సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 21న సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

More in AP