← Back to news

అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలి

By padam Kavyamani· 28 Aug 2026
అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి ఆదుకోవాలి

జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా అత్యంత నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి అవసరమైన ప్రభుత్వ సహాయాన్ని అందించాలని పలమనేరు నియోజకవర్గ పి-4 ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీదేవి సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన జీరో పావర్టీ మిషన్‌పై వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం పలమనేరు మండలం టి.వడ్డూరు గ్రామంలో గ్రామ సమాఖ్యల ద్వారా గుర్తించిన అత్యంత నిరుపేద కుటుంబాలను పరిశీలించారు.

More in Local