రైలెక్కేలోపే నిందితురాలికి షాక్

TG: కరీంనగర్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రూ.26 లక్షల చోరీ కేసులో మరో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు తగరం శంకర్ను నిన్న అరెస్ట్ చేయగా, ఆయన సన్నిహితురాలు ఆడెపు రేష్మాను తీగలగుట్టపల్లి రైల్వేస్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చోరీ చేసినట్లు అంగీకరించింది. శంకర్తో కలిసి ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించి బాత్రూమ్లో దాచిన రూ.26 లక్షల నగదును దొంగిలించినట్లు ఒప్పుకుంది. పరార్ అయ్యేందుకు రైలు కోసం వేచి ఉండగా పట్టుకుని రిమాండ్కు తరలించారు.



