పల్లెనిద్ర... గ్రామస్తులకు వార్నింగులు...

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం పల్లెనిద్రలో భాగంగా సంతకవిటి మండలం బిల్లాని గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర రావు గ్రామస్థులతో సమావేశమై షాకింగ్ హెచ్చరికలు చేశారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, మహిళల భద్రత కోసం శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎలాంటి గొడవలకు పోవద్దని సూచించారు.

