చదువుకోవాలని ఉంది కానీ, స్కూల్ ప్రయాణమే ప్రశ్నార్థకం
AP: చదువుకోవాలనే తపన ఉంది.. కానీ స్కూలుకు వెళ్లే ప్రయాణమే ప్రశ్నార్థకంగా మారింది అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన సుమారు 40 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన తమకు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. తమ ప్రాంతానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.



