కామారెడ్డిలో యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం

TG: యువజన కాంగ్రెస్ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్చార్జ్ ఖలీద్ అహ్మద్ పిలుపునిచ్చారు. కామారెడ్డిలో జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు, ఐవైసీ యాప్లో గ్రామ కమిటీల ఏర్పాటు, పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంపై చర్చించారు.





