← Back to news

బ్యాంక్‌లోనే మోసం

By DK· 29 Jul 2026· కామారెడ్డి జిల్లా
బ్యాంక్‌లోనే మోసం

TG: కామారెడ్డి జిల్లాలోని SBI బ్యాంక్‌లో మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు చాకచక్యంగా రూ.15వేల నగదును కాజేశారు. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ బ్యాంకులో నగదు లెక్కపెడుతుండగా ఇద్దరు వ్యక్తులు డబ్బులు సరిగ్గా లెక్కపెడతామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన ఆమె నగదు ఇవ్వగా, నోట్ల కట్టలో నుంచి రూ.15వేలు చాకచక్యంగా తీసేసి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత డబ్బు తక్కువగా ఉండటాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. CC ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 11h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.