ఆసియాలో డిజిటల్ చెల్లింపుల్లో భారత్ టాప్

ఆసియా దేశాల్లో డిజిటల్ చెల్లింపుల వినియోగంపై 2026లో నిర్వహించిన సర్వేలో భారత్ ప్రత్యేకంగా నిలిచింది. భారత్లో 97 శాతం మంది డిజిటల్ చెల్లింపు సేవలను ఉపయోగిస్తున్నట్లు తేలింది. గూగుల్ పే 71 శాతం వినియోగంతో ముందుంది. ఫోన్పేను 63 శాతం, అమెజాన్ పేను 59 శాతం మంది ఉపయోగిస్తున్నారు. చైనాలో వీచాట్ పే, అలీపే, దక్షిణ కొరియాలో నేవర్ పే ఎక్కువగా వాడుతున్నట్లు సర్వే వెల్లడించింది.


