ఆత్మహత్యకు ముందు షాకింగ్ సూసైడ్ నోట్

TG: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో పిట్ల వంశీ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందిన యువకుడు, ఆత్మహత్యకు ముందు SIR ఫాం మీద రాసిన సూసైడ్ నోట్లో తన చావుకు ప్రధాని మోడీ కారణమని పేర్కొన్నాడు. అలాగే తన కుటుంబసభ్యులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని, అంత్యక్రియలను ఆనవాయితీ ప్రకారం నిర్వహించాలని కోరాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.



