వేప చెట్టు వివాదం.. ఘర్షణలో ఇద్దరు మృతి

TG: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం ఎర్రగడ్డ తండాలో ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుని, గొడ్డళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఘటనలో మంద వెంకటేశ్వర్లు యాదవ్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన సైదాను 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకుంది. అడ్డుకునే క్రమంలో మేళ్లచెరువు ఎస్సై నవీన్కుమార్కు గాయాలయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.



