'జలసిరి’తో భూగర్భ జలాలు సేవ్ చేద్దాం! 💧
TG : నిజామాబాదు జిల్లాలో వర్షపు నీటిని వేస్ట్ చేయకుండా భూమిలోకి ఇంకించి, వాటర్ లెవెల్స్ పెంచడమే లక్ష్యంగా నందిపేట్ రాజ్నగర్ (ధుబ్బా) ఎస్సీ హాస్టల్ దగ్గర ‘జలసిరి’ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం వెర్టికల్ సోక్పిట్ (ఇంకుడు గుంత) పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాన నీటిని వేస్ట్ కాకుండా ఇంకుడు గుంతల్లోకి మళ్లిస్తే వాటర్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పారు. నెక్స్ట్ జెనరేషన్ కోసం నీటిని పొదుపుగా వాడుతూ, వాన నీటిని కాపాడుకోవాలని అన్నారు.



