దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం

AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలం జోగంపేట వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్న భక్తుల ఆటోను ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అలజంగి గ్రామానికి చెందిన చింతల గురునాయుడు (60) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.



