కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

TG: జీవో 97ను వ్యతిరేకిస్తూ వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలను జీవో 97 ద్వారా ‘శక్తి’ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ విలీనంతో పాలిటెక్నిక్ విద్యార్థులకు ECET ద్వారా బీటెక్లో లేటరల్ ఎంట్రీ అవకాశం దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తి చేసిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.



