తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లిన కారు!
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఒక అపార్ట్మెంట్ బేస్మెంట్ పార్కింగ్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ క్రితికా శర్మ తన ఐదేళ్ల కూతురు ఆర్యతో కలిసి కారులోంచి సామాన్లు తీస్తుండగా. ఒక కారు వేగంగా వచ్చి వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి ఆర్య స్వల్ప గాయాలతో బయటపడగా, క్రితికాకు తీవ్ర గాయాలవ్వడంతో ఐసీయూ (ICU)లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ భయానక దృశ్యాలు సిసిటివి (CCTV)లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



