తిరుమల బస్సులు బంద్

AP: తిరుమలకు వెళ్లే ఎలక్ట్రిక్ AC బస్సులను అలిపిరి డిపోలో నిలిపివేసి డ్రైవర్లు ఆందోళన చేశారు. ప్రతి డ్యూటీలో తప్పనిసరిగా 5 ట్రిప్పులు పూర్తి చేయాలని మేనేజ్మెంట్ నిబంధన పెట్టిందని, 5 ట్రిప్పులు పూర్తి చేయకపోతే నెలవారీ జీతానికి బదులుగా ట్రిప్పుల ఆధారంగా వేతనం చెల్లిస్తామని నిర్ణయించడంతో ఆందోళనకు దిగినట్లు వారు తెలిపారు. తిరుమలకు నడిచే ఎలక్ట్రిక్ AC బస్సుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే నిర్ణయాన్ని డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మార్పు వలన రాబోయే రోజుల్లో APSRTC ప్రైవేటీకరణ వైపు వెళ్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.



