రాపిడో డ్రైవర్కు డబ్బులు ఎగ్గొట్టిన మహిళ

రాపిడో బైక్ టాక్సీలో వచ్చిన ఒక మహిళ డబ్బులు ఇవ్వకుండా దిల్లీ 'సాకేత్ కోర్టు'లోకి వెళ్లిపోయింది. వెంటనే అక్కడి సెక్యూరిటీ ఆమెను ఆపారు. భరణం కేసుకు సంబంధించి ఆమె కోర్టుకు వచ్చినట్లు సమాచారం. డబ్బుల విషయంలో డ్రైవర్ తో గొడవ జరగడంతో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె మీద ఎవరైనా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారా లేదా అనేది కూడా ఇంకా తెలియలేదు.



