భవ్యమందిరంగా బాసర… సీఎం భూమి పూజ

చదువుల సరస్వతి నిలయమైన బాసర ఇక మీదట భవ్యమందిరంగా వెలుగొందబోతోంది. తొమ్మిది అంతస్తుల రాజగోపురం, ధ్యానమందిరం, గర్భాలయం అభివృద్ధి, కోనేరు పునరుద్ధరణ వంటి పనుల కోసం ప్రభుత్వం రూ.225 కోట్లు కేటాయించింది. జ్ఞానసరస్వతి దేవాలయం అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. ఆలయ విస్తీర్ణం 20 వేల చదరపు అడుగుల్లో ఉంటే దానిని ఏకంగా 62 వేల చదరపు అడుగులకి విస్తరిస్తున్నారు



