ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో

AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ పరిధిలోని ఊరందరు నేషనల్ హైవేపై రోడ్ యాక్సిడెంట్ జరిగింది. హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి చేపల లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్తో పాటు క్లీనర్ గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే సమీప హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంతో బొలెరో వాహనం ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. వాహనంలో ఉన్న చేపల లోడ్ రోడ్డుపై చిందరవందరగా పడిపోయింది.



