TCలు ఇవ్వకుండా సతాయిస్తున్న Wisdom

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని విస్డం కాలేజీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ యాజమాన్యం వారి టీసీలు (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా పలుమార్లు తిప్పించుకుంటోందని ఆరోపిస్తూ.. శనివారం విద్యార్థులు ధర్నాకు దిగారు. విస్డం కళాశాల ఇతర ప్రాంతాలకు అమ్ముడుపోయిన తర్వాత.. టీసీల కోసం వెళ్తే "రేపు రండి" అని వాయిదా వేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని యాజమాన్యంతో మాట్లాడగా.. "రేపు ఉదయం 10 గంటలకు ఇస్తాం" అని హామీ ఇచ్చారు.

