పంచాయతీ ఎన్నికల డ్రాఫ్ట్ జాబితా విడుదల

AP: స్థానిక సంస్థల ఎన్నికలు–2026కు సంబంధించిన ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని రింతాడ గ్రామ సచివాలయం వద్ద ప్రచురించారు. పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ స్థానిక నాయకుల సమక్షంలో జాబితాను విడుదల చేశారు. మొత్తం 5,391 మంది ఓటర్లకు 14 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించారు. అన్ని కేంద్రాలను జిటిడబ్ల్యూ హైస్కూల్, రింతాడలోనే ఏర్పాటు చేయనున్నారు. ప్రజల పరిశీలన కోసం జాబితాను సచివాలయం నోటీసు బోర్డులో ఉంచారు.



