వర్షం లేదు.. పాప్ కార్న్ ఎగుమతి!

వర్షాకాలం దగ్గర పడుతోంది కానీ.. రాష్ట్రంలో ఇప్పటికే 52% వర్షపాతం లోటని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బంది తప్పకుండా ఉంటుందని, వ్యవసాయ శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇక పాజిటివ్ వార్త ఏంటంటే – ఏలూరు ముసునూరులో దేశంలోనే తొలి నాన్-జీఎంఓ పాప్ కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని సీఎం, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కలిసి ప్రారంభించారు. "ఇక్కడి నుంచి పాప్ కార్న్ ప్రపంచానికి ఎగుమతి చేయాలి" అని సీఎం లక్ష్యం పెట్టారు. వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు జరుగుతున్నా... వర్షం మాత్రం ఇప్పటికీ కరువే!



