← Back to news

కడెం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద

By DK· 30 Jul 2026· నిర్మల్ జిల్లా
కడెం జలాశయంలోకి పోటెత్తుతున్న వరద

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని జిల్లా SP జానకి షర్మిల క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో వరద పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టు సమీపానికి వెళ్లొద్దని, వరద నీటిలో సెల్ఫీలు, ఫోటోలు తీయొద్దని హెచ్చరించారు.

More in TG