ఏకలవ్య స్కూళ్లలో సమస్యలపై ఆభిజీత్ దీప్కే పిలుపు
ఆదివాసీ పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని <a href="https://x.com/abhijeet_dipke/status/2100137240030494732">CJP ఫౌండర్ ఆభిజీత్ దీప్కే </a>కోరారు. ‘దేశంలో 720 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరైతే.. 477 మాత్రమే పనిచేస్తున్నాయి. 341 స్కూళ్లకే శాశ్వత భవనాలు ఉన్నాయి. 28 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ స్థాయిలో ST విద్యార్థుల GER 51.9 శాతం ఉండగా, నేషనల్ యావరేజ్ 58.4 శాతం. ఉన్నత విద్యలో ఇది 22.8 శాతానికి పడిపోతోంది' అని అన్నారు. వాలంటీర్లు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు కలిసి ఈ సమస్యపై గొంతెత్తాలి అని ఆయన పిలుపునిచ్చారు.



