ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితి పెంపు

ఉద్యోగుల భవిష్య నిధి - EPFOలో వేజ్ సీలింగ్ని కేంద్ర ప్రభుత్వం 15వేల నుంచి 25వేల రూపాయలకు పెంచింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పదేళ్లుగా ఈ పరిమితి 15వేలు గానే ఉంది. దీన్ని పెంచాలని ఎంప్లాయీ యూనియన్స్ చాలాకాలంగా కోరుతున్నాయి. కొత్త సీలింగ్తో మరింత మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ EPFO పరిధిలోకి వచ్చే చాన్స్ ఉంది. దీంతో ఎంప్లాయీస్కి PF, పెన్షన్ బెనెఫిట్స్ పెరగవచ్చు. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై సుమారు 11 వేల 339 కోట్ల అదనపు భారం పడనుంది.



