← Back to news

కార్యాలయంలోనే మాయమైన పింఛన్ డబ్బు

By DK· 1 Aug 2026· కర్నూలు జిల్లా
కార్యాలయంలోనే మాయమైన పింఛన్ డబ్బు

AP: కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ పంచాయతీలో పింఛన్ల పంపిణీకి ఉంచిన రూ.60 వేల నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. సచివాలయం-1 పరిధిలో పింఛన్ల పంపిణీ కోసం అధికారులు బ్యాంకు నుంచి రూ.10.70 లక్షలు డ్రా చేసి కార్యాలయ బీరువాలో భద్రపరిచారు. శనివారం ఉదయం పంపిణీకి ముందు నగదు లెక్కించగా రూ.60 వేల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్యాలయ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సచివాలయ సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి నగదు ఎలా మాయమైందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 10h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.