కార్యాలయంలోనే మాయమైన పింఛన్ డబ్బు

AP: కర్నూలు జిల్లా కోడుమూరు గ్రామ పంచాయతీలో పింఛన్ల పంపిణీకి ఉంచిన రూ.60 వేల నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. సచివాలయం-1 పరిధిలో పింఛన్ల పంపిణీ కోసం అధికారులు బ్యాంకు నుంచి రూ.10.70 లక్షలు డ్రా చేసి కార్యాలయ బీరువాలో భద్రపరిచారు. శనివారం ఉదయం పంపిణీకి ముందు నగదు లెక్కించగా రూ.60 వేల తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో కార్యాలయ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సచివాలయ సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి నగదు ఎలా మాయమైందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.



