హరిత ఆంధ్రప్రదేశ్ కోసం నాగబాబు పిలుపు.. 🌱

AP : ‘హరిత ఆంధ్రప్రదేశ్’ సాధించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని AP గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. మంగళగిరి నందవనంలో తన వైఫ్ పద్మజతో కలిసి ఆయన రావి, వేప మొక్కలను నాటారు. భూమాతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు, వాటిని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలని, నెక్స్ట్ జెనరేషన్కి మంచి ఎన్విరాన్మెంట్ అందించేందుకు అందరూ మొక్కలు నాటాలని కోరారు.


